మహబూబ్
నగర్ జిల్లాబిజినపల్లిమండలంలోనిమంగనూర్గ్రామానికి చెందిన కవి. వెంకటయ్య అను జన్మ
నామం కలిగిన ఈ కవి పరిమళ్పేరుతో కవిత్వం రాస్తున్నాడు. ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, పత్రిక, ప్రస్థానం, ప్రగతి,
సోయి, ప్రజాసంసృతి, అరుణతార వంటి పత్రికలలో, పాలమూరు
గోస, గ్లోబల్ఖడ్గం, మా ఊరు, జనకవనం. గుజరాత్ గాయం, ప్రపంచీకరణ ప్రతిధ్వని వంటి ఆభ్యుదయసాహిత్య సంకలనాలలో
వీరి కవితలు ముద్రించబడ్డాయి. కొన్ని కథలు కూడా రాశారు.విరసంవారు వెలువరించిన 'కథల పంట' లో వీరి కథకు స్థానం దక్కింది.2005 లో 42 కవితలతోమట్టిగంపకవితా సంకలనాన్ని వెలువరించాడు. కొన్ని
కవితలు, కొన్ని వ్యాసాలతో కలిపి 'డెడ్డెనకనక'అను పుస్తకాన్ని వెలువరించాడు.
ఉస్మానియా విశ్వ విద్యాలయంలో, డా.
బి. కేశవులు గారి పర్యవేక్షణలోపాలమూరు జిల్లా వచన కవిత్వం - ఆర్థిక,
సామాజిక విశ్లేషణఅను అంశం మీద పరిశోధన చేసి, డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారు. ప్రస్తుతంమాగనూర్ ప్రభుత్వ
జూనియర్ కళాశాలలో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేస్తున్నారు.పాలమూరు స్థితి గతులలో మార్పు కోసం గత కొంత
కాలంగా ఉద్యమిస్తున్నపాలమూరు
అధ్యయన వేదికలో
భాగస్వాములు. ఈ వేదికలోని ఇతర సోదర కవులుఉదయ
మిత్ర, ఇక్బాల్ పాషలతో కలిసిదుఃఖాగ్నుల
తెలంగాణఅను చిన్న కవితా
సంకలనాన్ని వెలువరించాడు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి