25, మే 2016, బుధవారం

వెల్లాల సదాశివశాస్త్రి

వెల్లాల సదాశివశాస్త్రి (1861-1925) మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కవి. జిల్లాలోని పెబ్బేరు మండలంలోని అయ్యవారిపల్లె వీరి స్వగ్రామం. తల్లి వెంకటసుబ్బమ్మ, తండ్రి శంకరజ్యోసులు. వీరు ప్రధానంగా చరిత్ర సంబంధిత రచనలు చేసారు.

రచనులు
1. వెలుగోటి వంశచరిత్రము
2. సురభి వంశచరిత్రము
3. ఆంధ్రుల చరిత్ర - విమర్శనము
4. వీరభద్రీయ ఖండనము
5. కంఠీరవ చరిత్రము
6. రామచంద్ర చరిత్రము
7. నామిరెడ్డి చరిత్రము
8. యతినిండా నిరాకరణము
9. రామానుజ గోపాల విజయము
10. ఆంధ్ర దశరూపక విమర్శనము

--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
అత్తాను రామానుజాచార్యులు * ఆచార్య మసన చెన్నప్ప *ఇక్బాల్ పాష *ఎలకూచి పినయాదిత్యుడు * ఎలకూచి బాలసరస్వతి *ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్ *ఏదుట్ల శేషాచలం  *కపిలవాయి లింగమూర్తి * కర్నాటి రఘురాములు గౌడు  * కాకునూరి అప్ప కవి  * కాణాదం పెద్దన * కాశీం*కె.పి. లక్ష్మీనరసింహకేశవపంతుల నరసింహశాస్త్రి *కొండన్న*  కోట్ల వెంకటేశ్వరరెడ్డి *గఫార్ * చింతలపల్లి ఛాయాపతి *జొన్నవాడ రాఘవమ్మ * టి.వి. భాస్కరాచార్య * తంగెళ్ళ శ్రీదేవి రెడ్డినములకంటి జగన్నాథ *పట్నం శేషాద్రిపరిమళ్ *పోల్కంపల్లి శాంతాదేవి *బారిగడుపుల ధర్మయ్య * బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్తభీంపల్లి శ్రీకాంత్ *మంథాన భైరవుడు *మల్లేపల్లి శేఖర్ రెడ్డి * ముష్టిపల్లి వేంకటభూపాలుడు * రాజవోలు సుబ్బరాయ కవి * రుక్మాంగదరెడ్డి * వెలుదండ రామేశ్వర్ రావు *వెల్లాల సదాశివశాస్త్రి * శివరాజలింగం *సందాపురం బిచ్చయ్య * సురభి మాధవరాయలు *హిమజ్వాల*



21, మే 2016, శనివారం

కాశీం

కాశీం తెలంగాణ ప్రాంతానికి చెందిన విప్లవకవి. వృత్తిరీత్యా విశ్వవిద్యాలయాచార్యులు. విప్లవ రచయితల సంఘంలో క్రియాశీల బాధ్యులు. తెలంగాణ ఉద్యమంలోనూ గణనీయమైన పాత్ర పోషించాడు. ఊరూరా తన ఉపన్యాసాలతో ఉద్యమానికి ఊతనిచ్చాడు.

స్వస్థలం
మహబూబ్ నగర్ జిల్లాలోని అచ్చంపేట ప్రాంతానికి చెందినవాడు. నిరుపేద దళిత
కుటుంబంలో జన్మించాడు.

వృత్తి జీవితం
కాశీం మొదట్లో హైదరాబాద్లోని ఆంధ్ర సారస్వత పరిషత్లో తెలుగు ఆచార్యులుగా పనిచేశాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో తెలుగు ఆచార్యులుగా పనిచేస్తున్నాడు.
 రచనలు

1. పొలమారిన పాలమూరు
2.నేను తెలంగాణోన్ని మాట్లాడుతున్నా
3. తెలంగాణ ఉద్యమాలు-పాట
4. తెలంగాణ సాహిత్యం
5.

'పొలమారిన పాలమూరు ' రచనను 2003 లో వెలువరించాడు. ఇది పాలమూరు జిల్లాలోని తీవ్రమైన కరువు నేపథ్యంలో వెలువరించిన దీర్ఘకవిత. 2003 లో పాలమూరు జిల్లా కరువు వ్యతిరేక పోరాట కమిటి ఆధ్వర్యంలో మహబూబ్ నగర్‌లోని టౌన్ హాలులో నిర్వహించిన 'పాలమూరు గోస ' కవి,గాయక సమ్మేళనంలో ఆవిష్కరించి, వినిపించాడు.

కాశీం కవిత్వంపై వ్యాఖ్యలు
కాశీం కవిత్వంపై పలువురు రచయితలు, ఆయన ఉద్యమ సహచరులు పలు వ్యాఖ్యానాలు చేశారు. వాటిలో కొన్ని...
* నాళేశ్వరం శంకరం: "కాశీం కవిత్వం సహజంగా కురిసే వర్షంలా ఉంటుంది. పారే నదిలా ఉంటుంది. మొలకెత్తే విత్తనంలా ఉంటుంది. పంటపొలం లా ఉంటుంది. ఆయన కవిత్వంలో తేమ ఎక్కువ.

* ఎండ్లూరి సుధాకర్: "అతని జీవితమే అతన్ని ఇంతటి స్థాయికి తెచ్చింది."
* నందిని సిధారెడ్డి: "ఆయన కవిత్వంలో అడుగుపెడితే అక్షరాలు తిరగబడుతున్న అలజడినీ, ఇగం పట్టిన పనిముట్టు మంట కాగుతున్న ఇగురం ధ్వనిస్తుంది. ఆయన అనుభవం మన అనుభవంలోకి కవిత్వం ద్వారా ప్రవేశింపగలిగాడు.

వరవరరావు:"కాశీం కవిత్వంలో ప్రకృతిలో బీభత్సమూ, సౌందర్యమూ కలనేతగా కనిపించే దృశ్యాల వలే ఆయన కవనాక్షరం రూపుదిద్దుకుంటుంది."

 ఇటీవల వార్తల్లో
కాశీం ఇటీవల వార్తల్లో నిలిచాడు. తెలంగాణ ప్రభుత్వం అతనిపై రాజద్రోహం కేసు మోపి అరెస్ట్ చేయమని ఆదేశాలు జారీ చేసింది. మావోయిస్ట్‌లతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు వచ్చాయి.

విప్లవ రచయితల సంఘం 25 వ మహా సభల్లో... 'రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనలు - అగ్రకుల తత్వం' అనే అంశం పై కాశీం ఉపన్యాసం.

--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
అత్తాను రామానుజాచార్యులు * ఆచార్య మసన చెన్నప్ప *ఇక్బాల్ పాష *ఎలకూచి పినయాదిత్యుడు * ఎలకూచి బాలసరస్వతి *ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్ *ఏదుట్ల శేషాచలం  *కపిలవాయి లింగమూర్తి * కర్నాటి రఘురాములు గౌడు  * కాకునూరి అప్ప కవి  * కాణాదం పెద్దన * కాశీం*కె.పి. లక్ష్మీనరసింహకేశవపంతుల నరసింహశాస్త్రి *కొండన్న*  కోట్ల వెంకటేశ్వరరెడ్డి *గఫార్ * చింతలపల్లి ఛాయాపతి *జొన్నవాడ రాఘవమ్మ * టి.వి. భాస్కరాచార్య * తంగెళ్ళ శ్రీదేవి రెడ్డినములకంటి జగన్నాథ *పట్నం శేషాద్రిపరిమళ్ *పోల్కంపల్లి శాంతాదేవి *బారిగడుపుల ధర్మయ్య * బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్తభీంపల్లి శ్రీకాంత్ *మంథాన భైరవుడు *మల్లేపల్లి శేఖర్ రెడ్డి * ముష్టిపల్లి వేంకటభూపాలుడు * రాజవోలు సుబ్బరాయ కవి * రుక్మాంగదరెడ్డి * వెలుదండ రామేశ్వర్ రావు *వెల్లాల సదాశివశాస్త్రి * శివరాజలింగం *సందాపురం బిచ్చయ్య * సురభి మాధవరాయలు *హిమజ్వాల*



9, మే 2016, సోమవారం

సమస్యా పూరణం

శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం బ్లాగ్ లో తేది: 22.02.2013 నాడు ఇచ్చిన సమస్యకు నా పూరణ.....
 
ఆ.             ముద్దపప్పు లోన శుద్ధ నెయ్యి గలిపి
                 ముద్ద ముద్ద కొక్క సుద్ధి వింటు
                 అమ్మ చేతి తోటి కమ్మనైనటువంటి
                 ఆవకాయ దినిన నమరుడగును

 

8, మే 2016, ఆదివారం

సమస్యా పూరణ


శ్రీ కంది శంకరయ్య గారి  శంకరాభరణం బ్లాగ్ లో తేది: 04.05.2016 నాడు ఇచ్చిన సమస్య కు
          నా  పూరణ....

 
             ఆ.                కన్న బిడ్డ పెళ్ళి కంటను కదలాడ
                                 అప్పు చేసి వేయ పప్పు పంట
                                 కలిసి రాని దైన కాల మిచ్చిన తాలు 
                                 ధాన్యము గని రైతు తల్లడిల్లె   

 

7, మే 2016, శనివారం

సమస్యా పూరణం


శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం బ్లాగ్ లో  తేది: ౦౩.05.2016 రోజు ఇచ్చిన  సమస్య(2022 /03.05.2016) కు నా  పూరణ-

 
 
 
 
 
 
 
 
కం.   కోపముననో! ఘన మునుల
         శాపమునో! పరుల భాష చపలత్వమునో!,
         తాపమునో! యిపుడు తెలుగు  
         దీపాలంకృత గృహమున దిమిరము నిండెన్

 

4, మే 2016, బుధవారం

సమస్యా పూరణం

ధర్మము నధర్మముగ నవతరణ పొంద   
నీతి నీలిగి చచ్చిన నీడలోన
పుట్ట గొడుగుగా నవినీతి పుట్టు చోట
గడ్డి మేయు జనులకెల్ల గలుగు సుఖము 


 


 

గుండాల జలపాతం


గుండాల జలపాతం మహబూబ్ నగర్ జిల్లా, ఆత్మకూరు మండలంలోని గుండాల గ్రామ సమీపంలో ఉంది. ఇక్కడ ఎత్తైన బండరాళ్ళపై నుండి కృష్ణానది ప్రవహించడం వలన జలపాతం ఏర్పడింది. కృష్ణానది పడమటి దిశ నుండి తూర్పు వైపు ప్రవహిస్తూ జలపాతాన్ని
సృష్టిస్తుంది. కృష్ణానదికి ఉత్తరం వైపు ఆత్మకూరు మండలంలోని గుండాల గ్రామం, దక్షిణం వైపు ధరూర్ మండలం ఉంటాయి. జలపాతానికి ఎగువన పడమటి వైపు నాలుగైదు కిలో మీటర్ల దూరంలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, దిగువన తూర్పు వైపు ఇరవై ఐదు కిలో మీటర్ల దూరంలో బీచుపల్లి ఆంజనేయస్వామి దేవాలయం ఉంటుంది. ఈ జలపాతం కేవలం వేసవి కాలంలో మాత్రమే కనిపిస్తుంది. వర్షకాలంలో నది నిండుగా, విస్తారంగా, ఉదృతంగా ప్రవహించడం వలన జలపాతం కనిపించదు. వేసవిలో నీటి ఉదృతి తగ్గడం, ప్రవహం ఒక సన్నని పాయ వలే ప్రవహించడం, నదిలోని బండరాళ్ళు తేలడం వలన ఆ బండరాళ్ళ మీద నుండి లోయలోకి నీరు దూకడం వలన జలపాతం కనిపిస్తూ, కనువిందు చేస్తుంది. జలపాతం ఏర్పడటానికి ముందు నది విశాలంగా తక్కువ లోతులో ప్రవహించటం వలన సందర్శకులు నీటిలో జలకాలాడుతూ వేసవిలో సేదతీరుతారు. నదికి ఇరువైపులా ఆత్మకూరు, ధరూర్ మండలాలలోని ప్రజలే కాకుండా, సుదూర ప్రాంతాల నుండి కూడా సందర్శకులు వస్తుంటారు.

కనుమరుగవుతున్న కనువిందు
కృష్ణకు ఇరువైపులా ప్రజలను ఏళ్ళ తరబడి కనువిందు చేసి, సేదతీర్చిన జలపాతం ఇప్పుడు కనుమరుగైపోతుంది. కారణం ఇక్కడి జలపాతం దగ్గరే దిగువ జూరాల జల విద్యుత్తు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం. దానికి తోడు కర్ణాటక రాష్ట్రంలోని ఆల్మట్టి, నారాయణాపూర్ ఆనకట్టల నుండి రాష్ట్రానికి రావలసిన మొతాదులో నీటి విడుదల కాకపోవడం, ఎగువ జూరాల ప్రాజెక్టు నుండి మహబూబ్ నగర్ జిల్లాలోని నెట్టెంపాడు ప్రాజ్రెక్ట్, భీమా ప్రాజెక్టు, కోయిల్ సాగర్ ప్రాజెక్టు, రామన్ పాడు ప్రాజెక్టు వంటి తాగు, సాగు నీటి పథకాలకు నీటి మళ్ళింపు అధికంగా జరగడం వలన అందమైన జలపాతం కనుమరుగైపోతుంది. దీనికి తోడు జిల్లాలో ఏర్పడిన విపరీత కరువు పరిస్థితుల కారణంగా గత వందేళ్ళలో ఎన్నడు కనిపించని విధంగా జలపాతం అడుగంటిపోయింది. సందర్శకులకు తీవ్ర నిరాశను మిగిల్చింది.




2, మే 2016, సోమవారం

సమస్యా పూరణం

శ్రీ కంది శంకరయ్య గారి శంకరాభరణం బ్లాగ్ లో ఇచ్చిన సమస్యకు నా పూరణ


సమస్య: 20119 - పాటు బడిన వారి కెట్లు ఫలితము దక్కున్



కందం.  చాటున మెక్కియు లంచము
               ధీటుగ పనిజేయక మరి దినములు గడిపెన్
               ఘాటుగ పరులను తిట్టియు
               పాటు పడిన వారి కెట్లు ఫలితము దక్కున్

సమస్యా పూరణం

శ్రీ కంది శంకరయ్య గారి 'శంకరాభరణం' బ్లాగ్ లో ఇచ్చిన సమస్యకు పూరణం

 సమస్య:2021   - కొయ్య గుర్ర మెక్కి కయ్య మాడె
 
 
 
ఆ.      వీర శూర రాకుమారులు రణమున
అశ్వమెక్కి పోర నలుపు లేక
                  పిరికి వాడొకడిని పిలవఁ బోక, గృహంబు
    కొయ్య గుర్ర మెక్కి కయ్య మాడె

1, మే 2016, ఆదివారం

తేది:13.01.2016 నాడు అరకు అందాలను నా సెల్  లో ఇలా బంధించా