17, అక్టోబర్ 2025, శుక్రవారం
30, సెప్టెంబర్ 2025, మంగళవారం
20, మే 2025, మంగళవారం
పవనపుత్ర శతకం - వెనుక మాట
పవనపుత్ర శతకం - వెనుక మాట
-ఎం.డి. ఉస్మాన్,వెనుకమాట. వినడానికి ఎబ్బెట్టుగా ఉంది కదా! నాకు కూడా అలానే అనిపించింది. కానీ it's a spontaneous word that arose in my mind immediately after reading the poetry. Moreover the great poet William Wordsworth said that "poetry is a spontaneous overflow of poets emotions", like wise, I got this word spontaneously. కాబట్టి ఈ పదాన్ని వాడా..! మన జయన్న కూడా ఈ శతకంలో అన్నారు "వచన కవిత యనుచు వంత వద్దు" అని, కాబట్టి నేను కరెక్టే... అని నా భావన. దీనికి ఇంకొక కారణం కూడా ఉంది అదేమంటే "ముందుమాట" రాసే అవకాశం, అదృష్టం నాకు రాదేమో ఎందుకంటే అది అంత అలవోక కాదు మరియు నేను అంత అర్హుడిని కూడా కాదు.
జయన్న శతకం మొదటి పద్యం చదవగానే , వేమన శతకం కోసం google లో చూడాలనిపించింది శతకానికి కూడా invocation ఉంటుందా అని? A great English poet Milton the "Paradise Lost" (an epic) ప్రారంభంలో అంటాడు.. "I invoke Thy aid to my adventurous song"అని. మన జయన్న గారు కూడా తన శతక ప్రారంభంలో " దీన కవికి తమ దీవెనలొసుగుము" అన్న మాటలు తనప్రభు భక్తికి వినమ్రతకు నిదర్శనం.
ఇక పద్యాల విషయానికొస్తే... బాగున్నాయి... చాలా బాగున్నాయి.... అద్భుతంగా ఉన్నాయి... ఇలా ఏమన్నా, మీ పదాలను, పద్యాలను తక్కువ చేసినట్లు అవుతుందేమో. ఎందుకంటే those are not simply words.. those are your deepest thoughts which were adorned with grammar and syntax.
"సిరుల కంటే విద్య గొప్పదనే" విషయాన్ని మీరు వర్ణించిన తీరు అద్వితీయం."ఎదుటివాడి గుణము నెంచవలదు" కూడా బాగా నచ్చింది ఎందుకంటే మనకు నచ్చనిది ఎదుటివారికి కూడా నచ్చకపోతే దాని గురించి చర్చిస్తుంటే ఇంకా బాగా అనిపిస్తుంది. గురువులను గౌరవించడానికి రెండు చేతులు ఉంటే చాలు అన్న మాట, అక్షలారా నిజము . "కడుపు నిండిన వాడి మాట కడుపు మండిన వాడి మాట"ల మధ్య వ్యత్యాసం బాగా వర్ణించారు.
"I know your simplicity and sensibility." "యముడి బాధ కన్నా నదికమ్ముగదనింద".. చదవగానే మీతో నేను గడిపిన రోజులలో చూసిన మీ వ్యక్తిత్వం గుర్తుకు వచ్చింది."కష్టమేది కలుగ కనిపించదరు మీరు"..
నిజమే.. కష్టాలు వచ్చినప్పుడు మనిషికి దేవుడు గుర్తుకొస్తాడు. ఇది చదివినప్పుడు చిన్నప్పుడు పరీక్షల సమయంలో "మసీదు"కు వెళ్లడం గుర్తుకొచ్చింది. "కులము పేరు చెప్పి బలము పెంచుకొనుచు" ప్రస్తుత పరిస్థితిని ,రాజకీయ నాయకులకు కుస్తీ ని తెలియజేస్తుంది.
"రాతదుడిచి గొప్ప గీత గియ్యవ స్వామి".. as teachers we teach all the students at the same valume, ఎవరెట్లా స్వీకరిస్తారు అనేది వారిపై ఆధారపడి ఉంటుంది in the same way , a mother looks after her all children with the same love and affection, కానీ ఆ సామి అందరి గీతలు ఒకే రకంగా ఎందుకు గీయడో... సమాధానం దొరకని ప్రశ్న.
"కలల యందు మనకు కానిదేముందిరా" సాధారణ, మధ్యతరగతి ప్రజల ఆలోచనలకు ప్రతిబింబం."చదువుకొనగ రాదు చదువు"కొనగ"వచ్చు.. సరళ పదాలతో నేటి విద్యా దుస్థితి కి అద్దం పడుతుంది. ఇక నేటి రాజకీయ నాయకుల పరిస్థితిపై, రాజకీయ దుస్థితిపై కవి ఎక్కుపెట్టిన బాణం గురి తప్పలేదు.
నిజమే.."పేద ఇంట ధనము పిసరైనా నిలవదు". ఈ పద్యం ద్వారా పునస్మరణ జరిగింది, కానీ కారణం దొరకలేదు."వాగులన్నీ గలసి వార్థి జేరువిధము" తో పోల్చడం జయన్న గారి సాహిత్య జ్ఞాన పరిపక్వతకు నిదర్శనం."రవిని వెతికినటుల రాతిరి సమయాన" మరొకటి.
చివరిగా ఒక విషయం చెప్పదలుచుకున్న.. ఈ పుస్తకం ప్రారంభం నుండి చివరి వరకు ఒకే sitting లో చదివా. అంత ఉత్సాహాన్ని, ఆనందాన్ని, ఆలోచనలను రేకెత్తించింది ఈ పుస్తకం. వెనువెంటనే నా అభిప్రాయాన్ని రాస్తూ చదివిన పద్యాలను నెమరు వేసుకుంటున్న.. ఇలాంటి మరెన్నో ప్రతిష్టాత్మక సంకలనాలు మీ కలము వెంట జాలువారాలని మనసారా కోరుకుంటున్న..
-ఎం.డి. ఉస్మాన్,
25, ఏప్రిల్ 2025, శుక్రవారం
ఆధునిక సమాజాన్ని అద్దంలో చూపిన శతకం.
ఆధునిక సమాజాన్ని అద్దంలో చూపిన భక్తిపూర్వక నివేదన శతకం.
తన మనోభావాలను అక్షరరూపంలో వ్యక్తంచేసి సమాజంలో చైతన్యాన్ని నింపేవాడే నిజమైన కవిగా పరిగణింపబడతాడు. ఎందరో కవులు వివిధ ప్రక్రియలలో రచనలు చేశారు. కాలం ఎంత మారినా మంచి పునాది గల పద్యరచన ఇంకా కొనసాగుతూనే ఉంది. సామాజిక దృక్పథంతో భక్తిపూర్వక నివేదనగా పండితపామర ప్రశంసల నందుకొన్న చక్కని గ్రంథం శ్రీ నాయుడుగారి జయన్నగారు రచించిన పవనపుత్ర శతకం.
ఈ కవి జోగులాంబ గద్వాల జిల్లా జల్లాపురం అను గ్రామంలో శ్రీమతి లక్ష్మీదేవి, శ్రీయుత గోపాలనాయుడు దంపతులకు జన్మించి , పెద్దమ్మ శంకరమ్మ కడ పెరిగి శ్రద్ధా భక్తులతో విద్యనభ్యసించి ఎం.ఏ., బి.యిడి., పట్టాపుచ్చుకొని ఉత్తమఉపాధ్యాయుడుగా పేరుపొందారు. దృక్కోణం(వ్యాసములు),నడిగడ్డ(దీర్ఘ కవిత) వంటి రచనలతో సాహితీ లోకంలో ప్రశంసలు పొందారు. వీరి బాల్యం పెద్దమ్మ గారి ఊరయిన పల్లెపాడులో గడిచింది. ఆ ఊరిలో గల ఆంజనేయస్వామి గుడిప్రాంగణంలో మిత్రబృందంతో తిరిగినందువలనను, కొత్త ఊరిలోను, ఉద్యోగము చేసిన బీచుపల్లిలోను ఆంజనేయుని గుడులు ఉన్నందువల్ల వీరికి ఆంజనేయస్వామిపై భక్తి కుదిరింది. అనంతరకాలంలో తనకు కలిగిన అనుభవాలు , ఆవేదనలూ, సమాజంపట్ల తనకున్న అభిప్రాయాలను ఆంజనేయస్వామికి చెప్పుకోవాలని భావించి చక్కని ఆటవెలది పద్యములతో ఒక శతకాన్ని రచించారు. తను పెరిగిన ఊరిపేరును కలిపి 'పల్లెపాటి వాస పవనపుత్ర ' అనే మకుటంతో ఆ స్వామికి తన భావాలను నివేదించి దీవెనలు కోరుతూ సామాజిక మార్పును అభిలషించారు.
ఈ శతకంలో సామాజిక అంశాలు చక్కగా ప్రస్తావించబడ్డాయి. పేద ధనికులమధ్యగల వ్యత్యాసాలు పేర్కొంటూ ఉన్నవారు లేనివారికి సహాయపడాలని సలహా ఇచ్చారు. కులాలు మతాల పేరుతో నేటి పాలకులు ప్రజలను వంచించి గద్దెనెక్కుతున్నారని, కూటికి లేని వాణ్ణి గమనించడంలేదని బాధపడ్డాడు. చదువు రాని మొద్దులకు రాజకీయం రాచబాట అయ్యిందని, కాసులున్నవాడు ఏదిచేసినా చెల్లుతూ ఉన్నదని నేటిసమాజాన్ని చూచి బాధపడతాడు.
"కులము పేరు జెప్పి బలము పెంచుకొనుచు
మతము పేరు జెప్పి మాయజేసి
గద్దె నెక్కి కులుకు మొద్దులున్నరు జూడు' అని నివేదిస్తూ,
కూడు లేక నొకడు కూలిపోవుచునుండె
రాజులాగ నొకడు రాలుచుండె
రాత దులిపి మంచిగీతగీయవ సామి! (34,35 పద్యాలు) అని పేదలబతుకులనుమార్చుమని స్వామిని అభ్యర్ధించారు.
ఉన్న ఊరును వలె మాతృభాషను గూడ చక్కగా ప్రశంసించారు.
అమ్మ పాలలోని కమ్మదనంబును
తేనెకన్న మించు తియ్యదనము
తెలుగు బాస గాక దేనిలో నుండురా
పల్లె పాటి వాస పవన పుత్ర (3)
అని కమ్మగా మాతృభాషయైన తెలుగును వర్ణించాడు.
పద్యకవితయైనా, గద్యకవితయైనా సమానంగా ఆదరించాలని కవి పాఠకులకు సందేశమిచ్చాడు. "పద్యమనుచు కవులు పలుచజేయ వలదు
వచన కవిత యనుచు వంత వద్దు
దేని ఘనత జూడ దానిదే లోకాన" అని పద్యగద్యములకు సమాన ప్రాధాన్యత నిచ్చారు.
లోకంలో నేడు మంచివారికంటె చెడ్డవారు అధికంగా ఉన్నారని చెబుతూ మంచినీటికంటె ఉప్పునీరు ఎక్కువగా ఉంటుంది గదా అని దృష్టాంతం తో సమర్థించారు.(4) కోపం గర్వం పనికిరానివని, చింత మనిషిని దహిస్తుందని, త్రాగుడుకు బానిసకావద్దని, బాలల్లో బ్రహ్మ ఉన్నాడని,ధనంకంటె గుణంగొప్పదని వ్యక్తిత్వవికాసలక్షణాలను పేర్కొన్నాడు. వ్యావహారిక పదాలను ప్రయోగిస్తూ భాషను సామాన్యజనులకు చేరువజేశాడు. సంపద ఉన్నపుడు భగవంతుడుగుర్తుకురాడని తెలుపుతూ ఈ సమాజాన్ని మార్చిఅందరినీ చల్లగా చూడు స్వామీ! అని ఆ పవనపుత్రుణ్ణి అభ్యర్థించాడు.
మొత్తమ్మీద ఈ శతకం సమాజహితాన్ని కాంక్షిస్తూ నీతి బోధకంగా అలరారుతూ ఉంది.
ఈ గ్రంథమును చదివి, ముందు మాటవ్రాసి, ఆశీర్వదించి, ముద్రణకు తోడ్పడిన ప్రముఖ పద్యకవులు అవధానులు శ్రీ కోట రాజశేఖర్ గారికి ధన్యవాదములు సమర్పిస్తూ ఈ కవి, భక్తిపూర్వకంగా ఈ కృతిని వారికి అంకితమియ్యడం హర్షించదగ్గ విషయం.
ఆంజనేయస్వామి వర్ణముఖచిత్రంతో, ఆటవెలది సొగసులతో, అందమైన పలుకుబళ్ళతో ఆకర్షణీయంగా ఉంది. ప్రతి ఒక్కరు దీనిని చదివి, ఆనందించి, ఆచరించగలరని ఆశిస్తున్నాను.
రచనలో ఈ కవి మరింత ముందుకు సాగాలని ఆశీర్వదిస్తున్నాను.
- డాక్టర్ చీమకుర్తి వేంకటేశ్వరరావు,
విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు, నెల్లూరు
పవనపుత్ర శతకంపై డా. చీమకుర్తి సమీక్ష
నెల్లూరు నుండి వెలువడే లాయర్ వారపత్రికలో నా పవనపుత్ర శతకంపై డా. చీమకుర్తి వేంకటేశ్వరరావు గారి సమీక్ష.
15, డిసెంబర్ 2024, ఆదివారం
నా కొత్త పుస్తకం
కొన్ని పుస్తకాలపై, కొందరు రచయితలపై అప్పుడప్పుడు రాసిన కొన్ని వ్యాసాలను ఇలా పుస్తకంగా తీసుకవస్తున్నాను.
3, మార్చి 2024, ఆదివారం
నేనూ - గొరుసు - గజఈతరాలు
12, జనవరి 2018, శుక్రవారం
అక్షరాగ్నికణం అలిశెట్టి
తండ్రి చిన రాజం, తల్లి లక్ష్మి. అలిశెట్టి ఇదే రోజు(12.01.1954) భూమ్మీదకు వచ్చిపడ్డాడు. ఇదే రోజు జీవితం నుండి నిష్క్రిమించాడు. పుట్టిన రోజే మరణించడం. మరణించిన రోజే పుట్టిన రోజు కావడం యాదృచ్చికం. అందుకే ఆయనకు మరణం లేదు. ఆయన కవిత్వానికి అంతకన్నా లేదు.
ఏడుగురు అక్కాచెల్లెళ్ళు, ఇద్దరు అన్నాదమ్ములు వెరసి మొత్తం పది మంది సంతానం తండ్రికి. పది మందిలో ఒకడిగా జన్మించాడు. కాబట్టే పది మంది మేలు కోరే కవిత్వం రాశాడు.
అసలు అలిశెట్టి ఎవరు?
పెన్సిల్తో, సరదాగా చాలా బొమ్మలను గీశాడు.
కెమెరా కంటితో సామాజిక దృశ్యాలను తీశాడు.
పెన్నును గన్ను చేసుకొని అస్తవ్యస్థ సమాజంపై కవితాస్త్రాన్ని సంధించాడు. ఆయనో చిత్రకారుడు. ఫోటోగ్రాఫర్, కవి. వెరసి ఆయనో బహుముఖ ప్రజ్ఞాశాలి. కుంచె, కెమెరా బతకడానికి పనికొచ్చాయి. మూడోది జీవింపజేసింది.
కవిత్వ భాషలో చెప్పాలంటే చెరబండరాజు తన గురించి తాను చెప్పుకున్న కవితను కొంచెం సరిజేసి చెప్తే అలిశెట్టికి అచ్చంగా సరిపోతుంది.
ఆకలి అతని పేరు
కలం అతని ఆయుధం
అభ్యుదయం అతని ఊరు.
11 ఏళ్ళకే తండ్రి మరణిస్తే, కుటుంబ పోషణ భారాన్ని తలకెత్తుకున్నాడు. ఆ క్రమంలోనే తలకెత్తుకున్న భారాన్ని తగ్గించుకోవడానికి బుజానికి కెమెరాను తగిలించుకున్నడు.
ఆదర్శాలను నేను, నీవు అందంగా వల్లిస్తాం. ఆచరణలో కొందరే పాటిస్తారు. ఈ రెండో కోవకు చెందినవాడే అలిశెట్టి. అందుకే భాగ్యం కన్నా మహాభాగ్యం ఏముంటుందని పేదింటి పిల్లైనా భాగ్యాన్ని తన ఇంటికి ఇల్లాలుగా తీసుకొచ్చాడు. ఎందుకంటే అందరికి డబ్బు విలువ తెలుసు. అలిశెట్టికి డబ్బుకు విలువ లేదని తెలుసు. ఆయనెప్పుడు డబ్బు వెంట వెంపర్లాడలేదు. డబ్బు సంపాదించే మార్గాలు మస్తుగున్న వాటన్నిటిని కాలదన్నాడు. కలాన్ని మాత్రమే అందుకున్నడు, నమ్ముకున్నడు. కాని అమ్ముకోలేదు.
మాటలతో మంట పుట్టించడం, అక్షరాలను అస్త్రాలుగా సంధించడం ఒక శ్రీశ్రీకి తెలుసు, చెరబండకు తెలుసు, అలిశెట్టికి కూడా తెలుసు. జీవితంలో కొరతగా ఉన్న డబ్బు నేర్పిందేమో! తక్కువ తక్కువగా వాడుకొమ్మని. అదే సూత్రాన్ని కవిత్వానికి వర్తింపజేశాడు. మిని కవితను అతను అందుకున్నడో!, మిని కవితే అతనల్లుకున్నదో! తెలువదు గానీ, అమ్మాకొడుకుల్లా అల్లుకపోయారు. ఎంతగా అంటే అలిశెట్టికి మిని కవిత తప్ప మరోటి రాదని విమర్శించెంతగా. అది తప్పని చెప్పడానికి ఆయన చురకలంటించాడులే గాని అది వేరే విషయం.
మూడు, నాలుగు పాదాలతో అద్భుత కవిత్వాన్ని సృస్టించడం అలిశెట్టికి మాత్రమే సాధ్యమైంది.బహుశా అది ఆకలి నేర్పిన పాఠం కావొచ్చు.
నిలబడు
బలపడు
సంతకాలపై కాదు
సొంతకాళ్ళపై అన్న కవితా ప్రేరణ కావొచ్చు.
లేకపోతే...
"తనువు పుండై..వేరొకరికి పండై
తను శవమై...వేరొకరికి వశమై
తను ఎడారై...వేరొకరికి ఒయాస్సిసై " అంటు వేశ్యల దయనీయ, దుర్భర జీవితాలకు చిత్రిక పట్టేవాడా? ఈ కవితెంత కరుణా సముద్రమో!, సంచలనమో! ఎన్ని వేదికల మీద ఎన్ని వేల గొంతుకలు ఉటంకించాయో వేరే చెప్పనక్కర్లేదనుకుంటా. ఆ విషయం కాలానికి తెలుసు, దాన్ని మోస్తున్న సాహిత్యానికి తెలుసు. కవిత్వాన్ని కోట్లా చేసి అభ్యుదయ తెలుగు సమాజం అత్యధికంగా ఉపయోగించుకున్నది శ్రీశ్రీ తరువాత అలిశెట్టినే అంటే అతిశయోక్తి కాదు.
జన్మించిన జగిత్యాలలో ఎర్రపావురాలు ఎగురవేశాడు. నిర్భందం వెంటాడితే కరీంనగర్ కొచ్చాడు ఆకలి జీవులకోసం మాట్లాడే మనిషి మౌనంగా ఉండగలడా? తన మాటలతో మంటల జెండాలు ఎగిరేశాడు. కరీంనగర్ కాదంటే హైదరాబద్ కొచ్చిపడ్డడు. ప్రాంతాలెన్ని మారినా, దోపిడి సమాజానికి చురకలు వేయడం మాత్రం మానలేదు. తన జీవితం రక్తరేఖ మీద నడుస్తున్నా...ఎన్నికల ఎండమావులు దాటుకుంటు , సంక్షోభ గీతాన్ని పాడుకుంటు సిటీ లైఫ్ అనుభవించాడు.
నగరం అర్థం కాని రసాయన శాల
చిక్కు వీడని పద్మ వ్యూహం అని అతనికి అనతి కాలంలోనే తెలిసిపోయింది. అయినా సిటీని వదల లేదు. సిటీలో తిరుగడం మానలేదు. సిటీపై రాయడం మానలేదు.
కాచీగూడా అంటే
కాచి వడబోసిన
కమ్మని కాఫీయే కదా! అంటు కాచిగూడాకు కవితొకటి కానుగ ఇచ్చాడు.
ఇరుకిరుకుగా ఉండే రేకుల సెడ్లో జీవితాన్ని నెట్టుకొచ్చాడు. అయితేనేం...
అర్ధాంగి చేటలో కన్నీళ్ళు చెరుగుతున్నప్పుడు/
సంసారం బరువును సమీక్షించగలిగాడు.
ఆయన దోపిడీ సమాజంపై సంధించిన కవితాస్త్రాలు అన్నీ, ఇన్నీ కాదు. ముఖ్యంగా రాజకీయాలను చీల్చి చెండాడు. ఒక పార్టీలో ఉంటునే మరో పార్టీ వైపు చూసే జంపు జిలానీలకు చురకలేశాడు.
"వాడు
ముందే వానపాము
ముడ్డెటో? మూతెటో? " అంటూ వాతలు పెట్టాడు.
"ఓ నక్క ప్రమాణ స్వీకారం చేస్తుంది
ఇంకెవరిని మోసం చేయనని
ఓ పులి పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తుంది
తోటి జంతువులను సంహరించనని
ఈ కట్టుకథ విన్న గొర్రెలు పుర్రెలు ఊపుతూనే ఉన్నాయి." అంటూ మోసగించే నేతలను, అమాయకత్వాన్ని వీడని జనాన్ని ఎద్దేవా చేస్తాదు. దురదృస్టమేమిటంటే అదే కట్టుకథలను నేతలు నేటికీ చెబుతున్న గొర్రెలు ఇంకా పుర్రెలు ఊపుతూనే ఉండటం. ఇంత పరిణాం చెందినా ఇంకా పరివర్తన చెందకపోవడం.
"గుడిసెలు
మేడల్ని కడతాయి
మేడలే
గుడిసెల్ని కొడతాయి" ఎన్ని తక్కువ మాటలు ఎంత గొప్ప మాటలు. ధనవంతుల అభివృద్ది సోపాన నేపథ్యాన్ని, దాని వెనుకే దాగున్న దోపిడీ వ్యవస్థను ఎంత అద్భుతంగా కళ్ళకు కట్టాడు.
"పాల రాతి బొమ్మైన
పార్లమెంట్ భవనమైన
వాడు చుడితేనే శ్రీకారం
వాడు కడితేనే ఆకారం" అంటూ శ్రమజీవి త్యాగాన్ని కీర్తిస్తాడు కవి.
ఇట్లా ఇది అది అని ఏమీ.. ఏదీ రాసినా పేదల కోసమే రాశాడు. వాళ్ళ కన్నీళ్ళు తుడువడానికే రాశాడు.
రాయనైతే రాశాడు కానీ రాసిన దానితో సంపాదించినదేమీ లేదు కీర్తి తప్ప. ఎందుకంటే ఆకలిని జయించాలన్న ఆరాటమే గానీ, ఆస్తులను కూడ బెట్టాలన్న ఆలోచన ఆయనకెప్పుడు లేదు. అందుకే ఆయన కవిత్వాన్నైతే జయించగలిగాడు గానీ వ్యక్తిగత జీవితాన్ని రోగానికి అప్పగించి ఓడిపోయాడు. అయితేనేం తెలుగు కవిత్వం ఉన్నంత కాలం అలిశెట్టి జీవించే ఉంటాడు. తెలుగు కవిత్వ యవనిక మీద అలిశెట్టి అభ్యుదయ పతాకై రెపరెపలాడుతూనే ఉంటాడు. ఆ స్ఫూర్తిని మనలో నింపుకొని సాగడమే మన ముందున్న కర్తవ్యం.
-నాయుడి గారి జయన్న
26, ఏప్రిల్ 2016, మంగళవారం
తెల్ల కాగితం - కొన్ని రాతలు
నిజంగా నేను మనిషినవుతాను.'' అని చెప్పగల త్యాగనిరతి ఎంత మందిలో ఉంటుంది. ఈ కవి అలాంటివాడే. కాబట్టే…
ఈ కవి రాజకీయ ఆశావాది. అందుకే..
2, ఏప్రిల్ 2016, శనివారం
హల్ధార్ నాగ్
7, అక్టోబర్ 2015, బుధవారం
'మాటల మడుగు '- కొన్ని మాటలు
నన్ను నేను అమ్ముకోవడానికి
బయలుదేరుతా '' ననటంలో, కేవలం బతకటం కోసం మన ఇష్టాలనెట్లా దూరం
చేకోవాలో తెలిపే ధైన్యం, అయిష్టాలనెట్లా బలవంతంగా
నెత్తికెత్తుకోవాలో తెలిపే దౌర్భాగ్యం ' జంతర్ మంతర్ ' కవితతో మనకు చూపిస్తూందీ కవి. ఇదే కవితలో ఒక చోట " నాలుకకు ఇరవై ఆరు అక్షరాల నరకాన్ని కట్టుకొని/ బయలుదేరుతాను"
అని అనటంలో పరాయి భాషెప్పుడూ మన సమస్త భావ వ్యక్తీకరణావసరాలను తీర్చలేదని చెప్పటం
లేదూ? ఆ ప్రయత్నం చేయడం నరకంతో సమానమేననే భావం కనిపించటం లేదూ? ఉద్యోగమంటే ఆషామాషి
కాదని, ఏ రోజుకారోజు పోరాటమేనని, ఆ రోజును ముగించటమంటే, ఆ యుద్ధంలో గెలవటమేనని
చెప్పినట్లుగా ఉంటుందీ కవిత. ఈ సంకలనంలో ఆణిముత్యాల్లాంటి కవితల్లో ఇదీ ఒకటి.











