14, జూన్ 2025, శనివారం

ఉమ్మడిశెట్టి లక్ష్మయ్య - తెలుగు తల్లి

 

విద్వాన్ ఉమ్మడిశెట్టి లక్ష్మయ్య రచించిన పద్య కావ్యం తెలుగు తల్లి.  లక్ష్మయ్య కడప జిల్లా కలసపాడు మండలం అక్కివారి పల్లి గ్రామానికి చెందినవారు.  గ్రేడ్ వన్ తెలుగు పండితులుగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు.

 

  ఈ తెలుగు తల్లి పుస్తకంలో  నన్నయ్య నుండి చిన్నయ్య వరకు ప్రాచీన కవుల కవితా సుగుణాలను పొగుడుతూ  ఆధునిక కవులను కూడా ఆరాధిస్తూ వివిధ ఛందస్సులలో పద్యాలను రాసి ఈ కావ్యాన్ని ఉమ్మడిశెట్టి లక్ష్మయ్య రచించారు.

అంతర్జాల యుగములో తెలుగు భాషకు ఆదరణ తగ్గిందని, ఆంగ్ల భాషా ప్రవాహ ఉరవడి ఎక్కువైందన్న  బాధతో  తెలుగు వారికి తెలుగు గొప్పదనాన్ని ప్రబోధిస్తూ కవి ఈ తెలుగు తల్లిని రచించారు.

ఈ కావ్యంలో ‌కవి ముందు వివిధ దేవతా ప్రార్థనలతో ప్రారంభం చేసి, తెలుగు కవులందరినీ  స్మరిస్తూ ఈ కావ్యాన్ని రచించాడు.

"శబ్దశాసనుండు లబ్ధ యశుండయ్యె

ఆంధ్ర భారతమ్ము  నల్లె మొదట

ఆదికవి యటంచు ఆరాధ్యుడయ్యెను

అక్షరముల రమ్య తలర గూర్చి "   అంటూ నన్నయ్యను కీర్తించాడు. 

ఈ వరుసలో నారాయణ భట్టు, భీమకవి, తిక్కన, ఎర్రన,   పోతన, శ్రీనాథుడు, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులు,వీరబ్రహ్మేంద్రస్వామి, వేమన మొదలగు ప్రాచీన కవులందరినీ కీర్తిస్తూ పద్యాలు రాశారు.

పదకవులను, అవధానులను ప్రవచన కారులను కూడా కీర్తిస్తూ ఇందులో పద్యాలను రాశారు. 

ఈ పుస్తకం అనుబంధంలో 'గండికోట గత ఘన వైభవం' పేరుతో గండికోట చరిత్రను కీర్తిస్తూ మరికొన్ని పద్యాలు ఉన్నాయి.  పద్య ప్రియులు చదువు దగ్గ పుస్తకం.

ప్రతులకు:

ఉమ్మడిశెట్టి లక్ష్మీదేవి -  99 854 920 49 , 9581774649

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి