విద్వాన్ ఉమ్మడిశెట్టి లక్ష్మయ్య రచించిన పద్య కావ్యం తెలుగు తల్లి. లక్ష్మయ్య కడప జిల్లా కలసపాడు మండలం అక్కివారి పల్లి గ్రామానికి చెందినవారు. గ్రేడ్ వన్ తెలుగు పండితులుగా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు.
ఈ తెలుగు తల్లి పుస్తకంలో నన్నయ్య నుండి చిన్నయ్య వరకు ప్రాచీన కవుల కవితా సుగుణాలను పొగుడుతూ ఆధునిక కవులను కూడా ఆరాధిస్తూ వివిధ ఛందస్సులలో పద్యాలను రాసి ఈ కావ్యాన్ని ఉమ్మడిశెట్టి లక్ష్మయ్య రచించారు.
అంతర్జాల యుగములో తెలుగు భాషకు ఆదరణ తగ్గిందని, ఆంగ్ల భాషా ప్రవాహ ఉరవడి ఎక్కువైందన్న బాధతో తెలుగు వారికి తెలుగు గొప్పదనాన్ని ప్రబోధిస్తూ కవి ఈ తెలుగు తల్లిని రచించారు.
ఈ కావ్యంలో కవి ముందు వివిధ దేవతా ప్రార్థనలతో ప్రారంభం చేసి, తెలుగు కవులందరినీ స్మరిస్తూ ఈ కావ్యాన్ని రచించాడు.
"శబ్దశాసనుండు లబ్ధ యశుండయ్యె
ఆంధ్ర భారతమ్ము నల్లె మొదట
ఆదికవి యటంచు ఆరాధ్యుడయ్యెను
అక్షరముల రమ్య తలర గూర్చి " అంటూ నన్నయ్యను కీర్తించాడు.
ఈ వరుసలో నారాయణ భట్టు, భీమకవి, తిక్కన, ఎర్రన, పోతన, శ్రీనాథుడు, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవులు,వీరబ్రహ్మేంద్రస్వామి, వేమన మొదలగు ప్రాచీన కవులందరినీ కీర్తిస్తూ పద్యాలు రాశారు.
పదకవులను, అవధానులను ప్రవచన కారులను కూడా కీర్తిస్తూ ఇందులో పద్యాలను రాశారు.
ఈ పుస్తకం అనుబంధంలో 'గండికోట గత ఘన వైభవం' పేరుతో గండికోట చరిత్రను కీర్తిస్తూ మరికొన్ని పద్యాలు ఉన్నాయి. పద్య ప్రియులు చదువు దగ్గ పుస్తకం.
ప్రతులకు:
ఉమ్మడిశెట్టి లక్ష్మీదేవి - 99 854 920 49 , 9581774649
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి