8, ఫిబ్రవరి 2015, ఆదివారం

బాలచంద్ర వనాజీ నెమడే

బాలచంద్ర వనాజీ నెమడే   
మరాఠీ చయిత. కోసలహిందూ పుస్తకాల రచయితగా సుప్రసిద్ధుడు. 2014సంవత్సరానికిగానూ జ్ఞానపీఠ పురస్కారానికి ఎంపికయ్యాడు.      నెమడే 1938లో ఖాందేశ్‌లోని సంగవి గ్రామంలో జన్మించాడు. మహారాష్ట్ర,పూనేలోని ఫెర్గూసన్ కళాశాల నుండి బాచిలర్ డిగ్రీనిఅదే పూనేలోని డెక్కన్ కాలేజి ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ రిసెర్చ్ నుండి భాషాశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. ముంబై విశ్వవిద్యాలయం నుండి ఆంగ్లంలో మాస్టర్ డిగ్రీని అందుకున్నాడు. ఉత్తర మహారాష్ట్ర విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డీ.డీ.లిట్.పట్టాలు అందుకున్నాడు.    నెమడే ఆంగ్లంమరాఠీతులనాత్మక సాహిత్యం మొదలగు అంశాలను వివిధ విశ్వవిద్యాలయాలలో బోధించాడు. లండన్లోని స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ లాంగ్వేజెస్‌లోను పనిచేశాడు. ముంబై విశ్వవిద్యాలయంలో గురుదేవ్ రవీంద్రనాథ ఠాగూర్ తులనాత్మక సాహిత్య పీఠంలో పనిచేసి పదవీ విరమణ పొందాడు. 1960లో మరాఠీ పత్రిక 'వాచా కు సంపాదకుడిగా పనిచేశాడు. 1990లో టీక స్వయంవర్ అను విమర్శా గ్రంథానికి సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నాడు. 2015 ఫిబ్రవరీలో జ్ఞానపీఠ పురస్కారం పొందాడు. 
సాహితీ ప్రస్థానం
1963లో నెమడే తన మొదటి నవల కోసల ను వెలువరించాడు. ఇదీ గ్రామీణ ప్రాంతం నుండి పూనేకు చదువుకోడానికి వచ్చిన ఓ యువకుని కథ. ఇదీ నెమడే జీవితాన్ని ప్రతిబింబించే నవల. ఈ నవల ఆంగ్లం, హిందీ, గుజరాతీ, కన్నడ, అస్సామీపంజాబీ, బెంగాళీ, ఉర్దూ, ఓరియా వంటి పలు భాషల్లోకి అనువాదమైంది. దీని తర్వాత బీదర్హూల్జరీలా మరియు జూల్ అను మరో నాలుగు నవలలు రాశాడు. 
రచనలు
నవలలు 
 1.   కోసల(Kosla)
 2.   బీదర్ (Bidhar)
3.   హూల్(Hool)
4.   జరీలా(Jarila)
5.   జూల్(Jhool)
కవితా సంకలనాలు
1.   మెలోడీ (Melody)
2.   దెఖనీ Dekhani
విమర్శా గ్రంథాలు
1.   టీకాస్వయంవర్
2.   సాహిత్యాచీ భాష
 3.       తుకారామ్
 4.     మరాఠీపై ఆంగ్లభాషా ప్రభావం.
  5.   ఇండో - ఆంగ్లియన్ రాతలు
  6.   స్థానికత్వం (దేశీవాద్)




























                                  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి