26, డిసెంబర్ 2013, గురువారం

మా పాలమూరు కవులు - రాజవోలు సుబ్బరాయ కవి



రాజవోలు సుబ్బరాయ కవి మహబూబ్ నగర్ జిల్లాలో తుంగభద్ర నదికి ఉత్తరాన విలసిల్లిన రాజవోలు ( నేటి రాజోలి) ప్రాంతానికి చెందిన కవి. 17 వ శతాబ్ధానికి చెందినవాడు. రాజవోలు ప్రభువైన ముష్టిపల్లి వేంకటభూపాలుడుకి సమకాలికుడు. ఆరువేల నియోగి బ్రహ్మణుడు. అపస్తంభసూత్రుడు. శ్రీవత్సగోత్రుడు. సంసృతాంధ్రములందు సమాన పాండిత్యం కలిగినవాడు. ఈ కవి ' జయవిజయాభ్యుదయం ' అను ఆరు ఆశ్వాసాల ప్రబంధాన్ని రచించాడు. ఈ ప్రబంధాన్ని రాజులకు అంకితమివ్వడానికి ఇష్టపడని కవి, తనకెంతో ఇష్టమైన రాజోలి గ్రామంలో వెలిసిన వేంకటేశ్వరస్వామికి అంకితమిచ్చాడు. ఈ సుబ్బరాయ కవి చిత్రాంగదా పరిణయం, గరుడాంజనేయ సంవాదం, సుదంత పరిణయం, కృష్ణార్జున సంవాదం(ద్విపద) మొదలగు రచనలు చేసినట్లు తానే స్వయంగా ఓ సీసపద్యంలో చెప్పుకున్నాడు. ఈ కవి పరాశర వేంకటభట్టు, రమణార్యులు తన గురువులని చెప్పుకున్నాడు. పింగళి సూరన స్పూర్తితో 'జయవిజయాభ్యుదయం ' రాయడం వలన అది 'కళాపూర్ణోదయం ' ను పోలి ఉంటుందని కూడా చెప్పుకున్నాడు.

--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
అత్తాను రామానుజాచార్యులు * ఆచార్య మసన చెన్నప్ప *ఇక్బాల్ పాష *ఎలకూచి పినయాదిత్యుడు * ఎలకూచి బాలసరస్వతి *ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్ *ఏదుట్ల శేషాచలం  *కపిలవాయి లింగమూర్తి * కర్నాటి రఘురాములు గౌడు  * కాకునూరి అప్ప కవి  * కాణాదం పెద్దన * కాశీం*కె.పి. లక్ష్మీనరసింహకేశవపంతుల నరసింహశాస్త్రి *కొండన్న*  కోట్ల వెంకటేశ్వరరెడ్డి *గఫార్ * చింతలపల్లి ఛాయాపతి *జొన్నవాడ రాఘవమ్మ * టి.వి. భాస్కరాచార్య * తంగెళ్ళ శ్రీదేవి రెడ్డినములకంటి జగన్నాథ *పట్నం శేషాద్రిపరిమళ్ *పోల్కంపల్లి శాంతాదేవి *బారిగడుపుల ధర్మయ్య * బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్తభీంపల్లి శ్రీకాంత్ *మంథాన భైరవుడు *మల్లేపల్లి శేఖర్ రెడ్డి * ముష్టిపల్లి వేంకటభూపాలుడు * రాజవోలు సుబ్బరాయ కవి * రుక్మాంగదరెడ్డి * వెలుదండ రామేశ్వర్ రావు *వెల్లాల సదాశివశాస్త్రి * శివరాజలింగం *సందాపురం బిచ్చయ్య * సురభి మాధవరాయలు *హిమజ్వాల*



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి