6, డిసెంబర్ 2013, శుక్రవారం

మా పాలమూరు కవులు - హిమజ్వాల


హిమజ్వాల మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు. సాహితీ రంగంలో విశిష్టతను కలిగిన హిమజ్వాల అసలు పేరు ఇరువింటి వెంకటరమణ. 1950లో జన్మించారు. తెలుగు ఉపన్యాసకులుగా పనిచేశారు. ' తెలుగు సాహిత్యంపై శరత్ ప్రభావం ' అను అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టాను పొందారు. 14 వ ఏట నుండె కవిత్వం రాయడం మొదలుపెట్టారు. తొలినాళ్ళలో ఛందో బద్ద కవిత్వం రాశారు. తరువాత వచన కవిత్వం రాసి 1977 లో ' చూపు ' అను కవితా సంపుటిని వెలువరించాడు. వీరు రాసిన అనేక కవితలు, పాటలు, విమర్శలు అనేక పత్రికలలో వెలువడ్డాయి. ఇతను ఏమి రాసినా అవన్నీ ప్రజాపక్ష పాత దృష్టితో రాసినవే. సాహిత్యం మార్క్సిజం వెలుగులో జనించాలన్నది వీరి అభిప్రాయం. విరసం సభ్యులుగా అనేక సాహిత్య కార్యక్రమాలను నిర్వహించారు.


--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
అత్తాను రామానుజాచార్యులు * ఆచార్య మసన చెన్నప్ప *ఇక్బాల్ పాష *ఎలకూచి పినయాదిత్యుడు * ఎలకూచి బాలసరస్వతి *ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్ *ఏదుట్ల శేషాచలం  *కపిలవాయి లింగమూర్తి * కర్నాటి రఘురాములు గౌడు  * కాకునూరి అప్ప కవి  * కాణాదం పెద్దన * కాశీం*కె.పి. లక్ష్మీనరసింహకేశవపంతుల నరసింహశాస్త్రి *కొండన్న*  కోట్ల వెంకటేశ్వరరెడ్డి *గఫార్ * చింతలపల్లి ఛాయాపతి *జొన్నవాడ రాఘవమ్మ * టి.వి. భాస్కరాచార్య * తంగెళ్ళ శ్రీదేవి రెడ్డినములకంటి జగన్నాథ *పట్నం శేషాద్రిపరిమళ్ *పోల్కంపల్లి శాంతాదేవి *బారిగడుపుల ధర్మయ్య * బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్తభీంపల్లి శ్రీకాంత్ *మంథాన భైరవుడు *మల్లేపల్లి శేఖర్ రెడ్డి * ముష్టిపల్లి వేంకటభూపాలుడు * రాజవోలు సుబ్బరాయ కవి * రుక్మాంగదరెడ్డి * వెలుదండ రామేశ్వర్ రావు *వెల్లాల సదాశివశాస్త్రి * శివరాజలింగం *సందాపురం బిచ్చయ్య * సురభి మాధవరాయలు *హిమజ్వాల*



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి