28, డిసెంబర్ 2013, శనివారం

మా పాలమూరు కవులు - బారిగడుపుల ధర్మయ్య



బారిగడుపుల ధర్మయ్య మహబూబ్ నగర్ జిల్లాలోని జటప్రోలు సంస్థానం సమీపంలోని బారిగడుపుల పుణ్యక్షేత్రవాసి. కవి, పండితుడు. ఇతని తండ్రి తిమ్మప్ప. బారిగడుపుల పుణ్యక్షేత్రాన్ని నిర్మించినది ఈ తిమ్మప్పగారే. ఇక్కడి దేవుడు నరసింహస్వామి. ఈ స్వామి చరిత్రనే బారిగడుపుల ధర్మయ్య ' నృసింహపురాణం ' అను పేరుతో ద్విపద కావ్యంగా రాశాడు. దీనిని ఈ నరసింహస్వామికే అంకితమిచ్చాడు. ఈ కావ్యం ఆరు ఆశ్వాసాల గ్రంథం. ఇందులో జయవిజయుల మూడు జన్మల కథలను కవి కథనంగా మలిచాడు. ఈ కావ్య రచనలో ధర్మయ్య పోతరాజును అనుకరించినట్లు తెలుస్తుంది. ఈ కవి జటప్రోలు సమీపవాసి అయినా ఈ సంస్థానాన్ని ఆశ్రయించినట్లు ఆధారాలేమి లేవు. ' నృసింహపురాణం ' గద్వాల సంస్థానం వారి నుండి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి వారి కార్యాలయానికి చేరింది.

--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
అత్తాను రామానుజాచార్యులు * ఆచార్య మసన చెన్నప్ప *ఇక్బాల్ పాష *ఎలకూచి పినయాదిత్యుడు * ఎలకూచి బాలసరస్వతి *ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్ *ఏదుట్ల శేషాచలం  *కపిలవాయి లింగమూర్తి * కర్నాటి రఘురాములు గౌడు  * కాకునూరి అప్ప కవి  * కాణాదం పెద్దన * కాశీం*కె.పి. లక్ష్మీనరసింహకేశవపంతుల నరసింహశాస్త్రి *కొండన్న*  కోట్ల వెంకటేశ్వరరెడ్డి *గఫార్ * చింతలపల్లి ఛాయాపతి *జొన్నవాడ రాఘవమ్మ * టి.వి. భాస్కరాచార్య * తంగెళ్ళ శ్రీదేవి రెడ్డినములకంటి జగన్నాథ *పట్నం శేషాద్రిపరిమళ్ *పోల్కంపల్లి శాంతాదేవి *బారిగడుపుల ధర్మయ్య * బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్తభీంపల్లి శ్రీకాంత్ *మంథాన భైరవుడు *మల్లేపల్లి శేఖర్ రెడ్డి * ముష్టిపల్లి వేంకటభూపాలుడు * రాజవోలు సుబ్బరాయ కవి * రుక్మాంగదరెడ్డి * వెలుదండ రామేశ్వర్ రావు *వెల్లాల సదాశివశాస్త్రి * శివరాజలింగం *సందాపురం బిచ్చయ్య * సురభి మాధవరాయలు *హిమజ్వాల*



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి