25, డిసెంబర్ 2013, బుధవారం

మా పాలమూరు కవులు - చింతలపల్లి ఛాయాపతి


చింతలపల్లి ఛాయాపతి మహబూబ్ నగర్ జిల్లాలోని బోరవెల్లి సంస్థానానికి చెందిన కవి. 17 వ శతాబ్ధానికి చెందినవాడు. ఆర్యా శతకం రచించిన గోపాలకవి వీరి తండ్రిగారు. ఛాయాపతి బోరవెల్లి సీమకు రావడానికి ముందు దేవరకొండ సీమలోని బోయినపల్లిలో ఉండేవాడు. బోరవెల్లి సీమ ప్రభువు రాజా వెంకటరెడ్డి ఆహ్వనం మేరకు బోరవెల్లి సంస్థానానికి వచ్చాడు. ఇతను ఆంధ్రగీర్వాణ భాషలలో ' నవఘంట సురత్రాణ ' బిరుదాంకితుడు. సర్వంకష ప్రజ్ఞ కలవాడు. అష్టావధానాలు చేశాడు. వ్యస్తాక్షరిలో గొప్ప ప్రతిభ కలవాడు. కొత్త శ్లోకాలను అనులోమ, విలోమ క్రమంలో పఠించగలిగినవాడు. ఇతను మురళీగోపాల భక్తుడు. తిరుమల శ్రీనివాసాచార్యుల శిష్యుడు. ' రాఘవాభ్యుదయం ' అను గ్రంథాన్ని రచించాడు. దీనిని బోరవెల్లి ప్రభువుల ఇలవేల్పైన శ్రీచెన్న కేశవస్వామికి అంకితమిచ్చాడు. ఛాయాపతికి కవిత్వం పట్ల, కవుల పట్ల, కృతినాయకుల పట్ల కచ్చితమైన అభిప్రాయాలు ఉండేవి. వాటినన్నిటిని తన రాఘవాభ్యుదయంలో ప్రస్తావించాడు

--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
అత్తాను రామానుజాచార్యులు * ఆచార్య మసన చెన్నప్ప *ఇక్బాల్ పాష *ఎలకూచి పినయాదిత్యుడు * ఎలకూచి బాలసరస్వతి *ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్ *ఏదుట్ల శేషాచలం  *కపిలవాయి లింగమూర్తి * కర్నాటి రఘురాములు గౌడు  * కాకునూరి అప్ప కవి  * కాణాదం పెద్దన * కాశీం*కె.పి. లక్ష్మీనరసింహకేశవపంతుల నరసింహశాస్త్రి *కొండన్న*  కోట్ల వెంకటేశ్వరరెడ్డి *గఫార్ * చింతలపల్లి ఛాయాపతి *జొన్నవాడ రాఘవమ్మ * టి.వి. భాస్కరాచార్య * తంగెళ్ళ శ్రీదేవి రెడ్డినములకంటి జగన్నాథ *పట్నం శేషాద్రిపరిమళ్ *పోల్కంపల్లి శాంతాదేవి *బారిగడుపుల ధర్మయ్య * బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్తభీంపల్లి శ్రీకాంత్ *మంథాన భైరవుడు *మల్లేపల్లి శేఖర్ రెడ్డి * ముష్టిపల్లి వేంకటభూపాలుడు * రాజవోలు సుబ్బరాయ కవి * రుక్మాంగదరెడ్డి * వెలుదండ రామేశ్వర్ రావు *వెల్లాల సదాశివశాస్త్రి * శివరాజలింగం *సందాపురం బిచ్చయ్య * సురభి మాధవరాయలు *హిమజ్వాల*




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి