2, మార్చి 2014, ఆదివారం

మా పాలమూరు కవులు - నములకంటి జగన్నాథం



నములకంటి జగన్నాథం మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కవి. రాజకీయనాయకుడు. కాంగ్రేసువాది. మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ సభ్యులుగా, రెండు పర్యాయాలు ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యునిగా పనిచేశారు. ఈ కవి ' అరుంధతీదేవి చరిత్రం ' అను వచన కావ్యాన్ని, ' వనితా విలాసం ' అను పద్యకావ్యాన్ని, నల్గొండ జిల్లాలోని యాదగిరి నరసింహస్వామిపై శార్దూల మత్తేభ విక్రీడితలతో  ' శ్రీయాదగిరి నరసింహస్వామి ' శతకాన్ని రచించారు. ఉత్పలమాల, చంపకమాలలతో 'గిరిజా మనోహరా!' అను మకుటంతో, శతక రూపంలో ' శ్రీశైల గిరిజా మనోహరం ' అను కావ్యాన్ని రచించాడు. దీనిని నాటి ముఖ్యమంత్రి శ్రీకాసు బ్రహ్మానందరెడ్డికి....

"శైలజామనోనాథుని- శతక కృతిని
స్వీకరింపుము శ్రీశైల క్షేత్రపతిని
గూర్చి వ్రాసితి శుభములు - గొనుము జగతి
మానితౌదార్య మాముఖ్యమంత్రివర్య!  '' అంటూ అంకితమిచ్చాడు.

--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
అత్తాను రామానుజాచార్యులు * ఆచార్య మసన చెన్నప్ప *ఇక్బాల్ పాష *ఎలకూచి పినయాదిత్యుడు * ఎలకూచి బాలసరస్వతి *ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్ *ఏదుట్ల శేషాచలం  *కపిలవాయి లింగమూర్తి * కర్నాటి రఘురాములు గౌడు  * కాకునూరి అప్ప కవి  * కాణాదం పెద్దన * కాశీం*కె.పి. లక్ష్మీనరసింహకేశవపంతుల నరసింహశాస్త్రి *కొండన్న*  కోట్ల వెంకటేశ్వరరెడ్డి *గఫార్ * చింతలపల్లి ఛాయాపతి *జొన్నవాడ రాఘవమ్మ * టి.వి. భాస్కరాచార్య * తంగెళ్ళ శ్రీదేవి రెడ్డినములకంటి జగన్నాథ *పట్నం శేషాద్రిపరిమళ్ *పోల్కంపల్లి శాంతాదేవి *బారిగడుపుల ధర్మయ్య * బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్తభీంపల్లి శ్రీకాంత్ *మంథాన భైరవుడు *మల్లేపల్లి శేఖర్ రెడ్డి * ముష్టిపల్లి వేంకటభూపాలుడు * రాజవోలు సుబ్బరాయ కవి * రుక్మాంగదరెడ్డి * వెలుదండ రామేశ్వర్ రావు *వెల్లాల సదాశివశాస్త్రి * శివరాజలింగం *సందాపురం బిచ్చయ్య * సురభి మాధవరాయలు *హిమజ్వాల*



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి