9, మార్చి 2014, ఆదివారం

మా పాలమూరు కవులు - అత్తాను రామానుజాచార్యులు


అత్తాను రామానుజాచార్యులు మహబూబ్ నగర్ జిల్లా లోని మునిపల్లె గ్రామానికి చెందిన వారు. పాండురాజు వంశస్థుడు. మదనగోపాల భక్తుడు. ' రుక్మిణీ కల్యాణం ' ను కురవంజి రూపంలో రచించాడు. ఇందులో దవళాలు, సువ్వాలలు, మంగళహారతులు మొదలగు దేశి రచనలు ఉన్నాయని పరిశోధకులు తేల్చినారు. ఈ రుక్మిణి కురవంజి ప్రతి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి కార్యాలయంలో ఉంది. రుక్మిణీ కురవంజిలో ఓ మచ్చుతునక....
కొట్నాలు దంచేటప్పుడు పాడే సువ్వాల

"వన్నె సన్న నూది పచ్చ గన్నెరాలు కృష్ణ భోగి
సన్న రాజనాలు జీల సర్లు దంపు చూ
ఉబ్బి నిక్కి జంగ జూచి ఉవిదలెల్ల చెమట జార
గబ్బి గుబ్బ లదగాను కలయదంచిరీ





--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
అత్తాను రామానుజాచార్యులు * ఆచార్య మసన చెన్నప్ప *ఇక్బాల్ పాష *ఎలకూచి పినయాదిత్యుడు * ఎలకూచి బాలసరస్వతి *ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్ *ఏదుట్ల శేషాచలం  *కపిలవాయి లింగమూర్తి * కర్నాటి రఘురాములు గౌడు  * కాకునూరి అప్ప కవి  * కాణాదం పెద్దన * కాశీం*కె.పి. లక్ష్మీనరసింహకేశవపంతుల నరసింహశాస్త్రి *కొండన్న*  కోట్ల వెంకటేశ్వరరెడ్డి *గఫార్ * చింతలపల్లి ఛాయాపతి *జొన్నవాడ రాఘవమ్మ * టి.వి. భాస్కరాచార్య * తంగెళ్ళ శ్రీదేవి రెడ్డినములకంటి జగన్నాథ *పట్నం శేషాద్రిపరిమళ్ *పోల్కంపల్లి శాంతాదేవి *బారిగడుపుల ధర్మయ్య * బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్తభీంపల్లి శ్రీకాంత్ *మంథాన భైరవుడు *మల్లేపల్లి శేఖర్ రెడ్డి * ముష్టిపల్లి వేంకటభూపాలుడు * రాజవోలు సుబ్బరాయ కవి * రుక్మాంగదరెడ్డి * వెలుదండ రామేశ్వర్ రావు *వెల్లాల సదాశివశాస్త్రి * శివరాజలింగం *సందాపురం బిచ్చయ్య * సురభి మాధవరాయలు *హిమజ్వాల*


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి