28, జనవరి 2015, బుధవారం

పోల్కంపల్లి శాంతాదేవి

పోల్కంపల్లి శాంతాదేవి సామాజిక సమస్యలను, స్త్రీల అవస్థలను  తన నవలలో చిత్రీకరిస్తూ సామిజిక చైతన్యాన్ని కలిగిస్తున్న ప్రముఖ తెలంగాణ నవలా రచయిత్రి. సహజత్వంతో, వాస్తవికతకు దగ్గరగా, తాత్వికతతో కూడిన రచనలు చేసింది. మహబూబ్ నగర్ జిల్లా, పెబ్బేరు మండలంలోని శ్రీరంగాపూర్ వీరి స్వస్థలం. వీరి కథలపై శరత్ ప్రభావం ఎక్కువ.
     1942లో సీతమ్మ, సూగూరు హనుమంతరావు దంపతులకు జన్మించింది. వీరి పూర్వికులు, తండ్రిగారు కూడా వనపర్తి సంస్థానాధీశుల దగ్గర ఉన్నతోద్యోగులుగా పనిచేశారు. విద్యార్థి  దశ నుండే రచనా వ్యాసంగాన్ని మొదలు పెట్టారు.  1961లో వీరి మొదటి రచన ముక్తిమార్గం కుసుమహరనాథ పత్రికలో అచ్చైంది. ప్రజామత వారపత్రికలో ధారావాహికగా వీరి మొదటి నవల పాణీగ్రహం వచ్చింది.అదే పత్రికలో ఆ తరువాత కాలపురుషుని హెచ్చరిక వచ్చింది.  ఈమె 40 కు  పైగా నవలలు రాశారు. చండీప్రియ, ప్రేమపూజారి, బాటసారి, రక్తతిలకం,పచ్చిక, పూజాసుమం, ప్రేమ బంధం, జీవన సంగీతం, సుమలతదేవదాసి, పుష్యమి, వరమాల వీరి నవలలో కొన్ని.
 7 కథాసంపూటాలు వెలువరించింది. 1974లో ముళ్ళగులాభి అను కథా సంకలనాన్ని తన సంపాదకత్వంలో తీసుకవచ్చింది. జీవన సంగీతం, ప్రేమబంధం నవలలకు ఆంధ్రప్రభ నిర్వహించిన పోటీలలో బహుమతులు వచ్చాయి. చండీప్రియ, పుష్యమి, వరమాల, పచ్చిక నవలలు చలనచిత్రాలుగా వచ్చాయి. ఉజ్జ్వల. నవజ్యోతి, నవసాహితీ వంటి పలు సంస్థలు వీరి రచనలను ముద్రించాయి. జ్యోతి, జాగృతి వంటి పలు పత్రికల్లో అనేక వ్యాసాలు రాశారు. ఈమె మంచి వక్త కూడా. ఆదర్శగృహిణి. అల్లికలు,చిత్రలేఖనం, సాహిత్య కార్యక్రమాలాలో పాల్గొనడం ఆమె అభిరుచులు.
--------------------------------------------------------------------------------------------------------------------------
ఇవి కూడా చూడండి
పాలమూరు కవులు
అత్తాను రామానుజాచార్యులు * ఆచార్య మసన చెన్నప్ప *ఇక్బాల్ పాష *ఎలకూచి పినయాదిత్యుడు * ఎలకూచి బాలసరస్వతి *ఎస్. ఎం. మహమ్మద్ హుసేన్ *ఏదుట్ల శేషాచలం  *కపిలవాయి లింగమూర్తి * కర్నాటి రఘురాములు గౌడు  * కాకునూరి అప్ప కవి  * కాణాదం పెద్దన * కాశీం*కె.పి. లక్ష్మీనరసింహకేశవపంతుల నరసింహశాస్త్రి *కొండన్న*  కోట్ల వెంకటేశ్వరరెడ్డి *గఫార్ * చింతలపల్లి ఛాయాపతి *జొన్నవాడ రాఘవమ్మ * టి.వి. భాస్కరాచార్య * తంగెళ్ళ శ్రీదేవి రెడ్డినములకంటి జగన్నాథ *పట్నం శేషాద్రిపరిమళ్ *పోల్కంపల్లి శాంతాదేవి *బారిగడుపుల ధర్మయ్య * బిజినేపల్లి లక్ష్మీకాంతం గుప్తభీంపల్లి శ్రీకాంత్ *మంథాన భైరవుడు *మల్లేపల్లి శేఖర్ రెడ్డి * ముష్టిపల్లి వేంకటభూపాలుడు * రాజవోలు సుబ్బరాయ కవి * రుక్మాంగదరెడ్డి * వెలుదండ రామేశ్వర్ రావు *వెల్లాల సదాశివశాస్త్రి * శివరాజలింగం *సందాపురం బిచ్చయ్య * సురభి మాధవరాయలు *హిమజ్వాల*






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి